Monday, May 10, 2010

`మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కడం' అంటే ఇదే కాబోలు!

[తీగ మీద నడుస్తున్నట్లుంది ప్రభుత్వ పరిస్థితిపై రోశయ్య - వ్యాఖ్య నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల్ని గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి రోశయ్య ‘తీగ మీద నడుస్తున్నట్లుంది’ అని వ్యాఖ్యానించాడట. ప్రభుత్వ పరిస్థితి నిజంగా అంత కష్టంగా ఉందా బావా?

సుబ్బారావు:
వాళ్ళకేం కష్టం మరదలా!? ఉంటే గింటే సామాన్య ప్రజల పరిస్థితి, పప్పు కూరగాయల ధరల మోతతో, పన్నుల వాతతో, పాఠశాలల ఫీజుల ఫిరంగులతో, అతలాకూతలమై, సామాన్యులకి తీగ మీద నడుస్తున్నట్లుంటుంది గానీ!

సుబ్బలష్షిమి:
నిజం బావా! ఓ ప్రక్క ప్రజల బ్రతుకుని అధ్వాన్నం చేస్తూ, తమకి కష్టంగా ఉందనటం! ‘మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కడం’ అంటే ఇదే కాబోలు!

No comments:

Post a Comment