Tuesday, February 24, 2009

50. నిజాం సైనికులకు స్థలాల క్రమబద్దీకరణ

[నిజాం సైనికులకు స్థలాల క్రమబద్దీకరణ – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా, నాకు తెలియక అడుగుతాను, స్వాతంత్ర సమరయోధులకీ, తెలంగాణా విమోచన పోరాట యోధులకీ పింఛన్లు కూడా ఇవ్వకుండా కాళ్ళమీద పడేలా చూసుకుంటున్న నేటి రాష్ట్ర సర్కారు – మాజీ నిజాం సైనికులకి, వారి వారసులకు గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ స్థలాలు క్రమబద్దీకరించిందట. ఎందుకంటావు?

సుబ్బారావు:
ఎందుకేమిటి మరదలా? స్వాతంత్ర సమరయోధులూ, తెలంగాణా పోరాట యోధులు భారతదేశం కోసం పోరాడారు. అందుకే వాళ్ళకి పింఛన్లు కూడా పుట్టవు. అదే మాజీ నిజాం సైనికులు [రజాకార్లు] అయితే, నిజాం [హైదరాబాదు] సంస్థానాన్ని పాకిస్తాన్ లో కలిపేందుకు పోరాడారు. మరి వారికీ వీరికీ తేడా లేదా? అందుకే వీరికి ప్రభుత్వ భూములు కట్టబెడుతున్నారు.

సుబ్బలష్షిమి:
చూస్తే ఇప్పటికీ నిజాం రాజ్యమే ఉన్నట్లుంది బావా. అనవసరంగా ప్రజాస్వామ్యమని మనం పొంగిపోయి భంగ పడుతున్నట్లున్నాం.
***********

1 comment:

  1. Excellent. People are like sheep. Politicians herd those sheep at will. మిషనరి ware the cloaths of a Reddy Caste, and looting Hindu Temples and Temple lands. మిషనరి's daughter and son-in-law are big మిషనరిs.

    ReplyDelete