Tuesday, March 3, 2009

55. కాంగ్రెస్, వామపక్షాలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయా ?

[ఎన్నికలయ్యాక కాంగ్రెస్, వామపక్షాలు కలిసిపోతాయి – వెంకయ్య నాయుడు వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇదేమిటి బావా! మొన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఇదే మాటన్నాడు. ఈ రోజు వెంకయ్య నాయుడూ అంటున్నాడు.


సుబ్బారావు:
ఏమని మరదలా!

సుబ్బలష్షిమి:
ఎన్నికల తర్వాత కాంగ్రెస్, వామపక్షాలు కలిసిపోతాయట. మరి మొన్నెందుకు విడిపోయినట్లు?

సుబ్బరావు:
ఎప్పటి అవసరం అప్పుడు మరదలా! అయినా వెంకయ్యనాయుడు అలా అంటున్నాడంటే ఎన్నికల్లో హంగ్ వస్తుంది, కాంగ్రెస్ వామపక్షాలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి అని అర్ధమంటావా?

సుబ్బలష్షిమి:
భాజపా గెలిచి అధికారంలోకి వస్తే, మిగతా అన్నిపార్టీలు ప్రతిపక్షంలో ఉంటే కలిసిపోవటం ఎందుకు మరి? అంటే భాజపా గెలవబోదని ముందే జోస్యం చెప్పటం కాదా ఇది?

సుబ్బారావు:
జోస్యమే చెబుతున్నాడో, సంకేతమే ఇస్తున్నాడో ఎవరికి తెలుసు? ఏదైనా జరిగాక కదా తెలిసేది?

************

No comments:

Post a Comment