Sunday, March 29, 2009

80. వ్యాపారంగా ఉగ్రవాదం

[పాక్ లోని జమ్రుద్ పట్టణంలో మసీదులో ఆత్మాహుతిదాడి, 50 మంది దుర్మరణం – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పాకిస్తాన్ లో ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగి, 50 మంది మరణించారు, 100 మంది గాయపడ్డారట. విన్నావా?

సుబ్బారావు:
అవును. అయితే ఏమిటి?

సుబ్బలష్షిమి:
బావా నాకో సందేహం! తమ మతస్థుల మీద, అదీ ప్రార్ధనాస్థలంలో ప్రార్ధనలు చేస్తుండగా, దాడులు చేసిన ఉగ్రవాదసంస్థలు, మొన్న నవాజ్ షరఫ్ చేసిన లాహోర్ లాంగ్ మార్చ్ ని ఎందుకు వదిలిపెట్టాయి? అప్పుడు దాడిచేస్తే ఎక్కువమంది చనిపోతారు, మరింత పెద్దగగ్గోలు అంతర్జాతీయంగా అవుతుంది కదా!

సుబ్బారావు:
బహుశః నవాజ్ షరీఫ్, లాహోర్ లాంగ్ మార్చ్ లో, అలాంటి దాడులు జరగకుండా, ముందుగా ఉగ్రవాదసంస్థలతో డీల్ కొనుక్కొని ఉంటాడు మరదలా! ఇవాళా రేపూ, రాజకీయాల్లాగే ఉగ్రవాదం కూడా ఆర్ధిక మూలాలా మీదే నడుస్తోంది.

*****************

No comments:

Post a Comment