Thursday, March 11, 2010

ఆవు చేలో మేస్తూ, దూడని పస్తుండమంటుంది

[తప్పనిసరిగా ఒటింగ్ ఉండాలి : అద్వానీ - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! అద్వానీ తన బ్లాగులో "సమాజంలో దిగువ స్థాయి వర్గాలతో పోలిస్తే చదువుకున్నవారిలో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటోందని" వ్రాసాడట. అందుకని తప్పనిసరిగా ఓటింగ్ ఉండాలంటున్నాడు.

సుబ్బారావు:
ఆ దిగువ స్థాయి వర్గాలకి ఓటు కు నోటు ఇవ్వకపోతే.... ఆ ఓటింగ్ కూడా ఉండదు మరదలా! అయినా వాళ్ళు ప్రజా సేవ తప్పనిసరిగా చేయరు గానీ, మనం మాత్రం తప్పనిసరిగా ఓటింగ్ చేసేటట్లు చట్టం చేస్తారట.

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! ఆవు చేలో మేస్తూ, దూడని పస్తుండమంటుంది.

No comments:

Post a Comment