Thursday, March 25, 2010

దక్కేది ఎప్పటికైనా దక్కుతుంది, దక్కనిది ఎప్పటికి దక్కదు

[అనంతపురం డివిజన్ అటవీ అధికారి కల్లోల్ బిస్వాస్ గాలి జనార్ధన రెడ్డికి అనుకూలంగా పని చేసి ప్రస్తుతానికి వరంగల్ జిల్లాకు బదిలీ, భవిష్యత్తులో సస్పెన్షన్ వేటు ? - వార్త నేపధ్యంలో.]

సుబ్బలష్షిమి:
బావా! ఈనాడు భోగట్టా ప్రకారం, ఈ బిస్వాస్ కల్లోల్ గత ఏడాది నిబంధనల ముకుతాడు వేసి ఓబుళాపురం మైనింగ్ కంపెనీ యాజమాన్యాన్ని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించాడు. గాలి జనార్ధన రెడ్డి కూడా పైఅధికారుల ద్వారా అతడిని ముప్పతిప్పులు పెట్టాడు. చివరికి ఇద్దరు రాజీ పడినట్లు ఉన్నారు. అందుకే గాలి జనార్ధన రెడ్డికి అనుకూలంగా, ప్రభుత్వానికి చెప్పకుండా ఖనిజం రవాణాకు ఓఎంసీకి అనుమతిస్తూ నిర్ణయాలు తీసుకున్నందుకు ఆగ్రహించిన ప్రభుత్వం అతడిని వరంగల్ జిల్లాకు బదిలీ చేసింది. ఇప్పటికే వాటి మీద సిబిఐ విచారణ కూడా నడుస్తుందట. భవిష్యత్తులో కల్లోల్ బిస్వాస్ సస్పెన్షన్ అవుతాడని ఓ వార్త కూడా.

సుబ్బారావు:
అంతే మరదలా! ఎంత పొర్లాడిన అంటుకున్నంతే అంటుకుంటుందని సామెత! రజనీకాంత్ స్టైల్లో చెబితే ’దక్కేది ఎప్పటికైనా దక్కుతుంది, దక్కనిది ఎప్పటికి దక్కదు.’

No comments:

Post a Comment