Thursday, December 3, 2009

వడ్డించేవాడు మన వాడైతే చాలు,………

[పొరుగు దేశాలతో బాగుంటేనే భారత్ లో ఐటీ వృద్ధి. పాక్ తో సత్సంబంధాలూ మరీ ముఖ్యం – వరల్డ్ ఎడిటర్స్ ఫోరం సదస్సులో ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ వెల్లడి – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! భారత్ లో ఐటీ వృద్ధి చెందాలంటే, పొరుగుదేశాలతో, మరి ముఖ్యంగా పాకిస్తాన్ తో బాగుండాలట. విన్నావా?

సుబ్బారావు:
విన్నాను మరదలా! ’పాకిస్తాన్ లో దారిద్ర్యాన్ని తొలిగించకపోతే ఉగ్రవాదం పెరిగిపోతుంద’ అంటూ అమెరికా పాకిస్తాన్ కు డబ్బు ప్రవహింప చేస్తుంది. ఇచ్చిన డబ్బుల్ని పాకిస్తాన్ ఉగ్రవాదం కోసమే వాడుకుంటుందని నిరూపణ అయినా, తిడుతూనే డబ్బులిస్తున్నారు. ఇక రేపో ఎల్లుండో ఐటీ వృద్ధి కోసం భారతదేశం కూడా పాకిస్తాన్ కు పైసలిస్తుందేమో లే! చూద్దాం!!

సుబ్బలష్షిమి:
అందుకే అంటారేమో బావా, పెద్దలు! ’వడ్డించే వాడు మన వాడైతే చాలు, బంతిలో మూలన కూర్చున్న అన్నీ అందుతాయనీ’ పైకి ఏ మాటలు చెబితేనేం లే, చేతలు ముఖ్యం గానీ?

No comments:

Post a Comment