Thursday, December 3, 2009

శాస్త్రవేత్తల ఆవిష్కరణలన్నీ భవిష్యత్తు వ్యాపార సూత్రాల కోసమా?

[పింగాణీ, గాజు పాత్రల పై ఉండే సూక్ష్మక్రిముల కంటే, రాగి పాత్రలపై ఉండే సూక్ష్మక్రిములు చాలా చాలా తక్కువనీ, రాగి పాత్రల వాడకమే మంచిదంటున్న శాస్త్రవేత్తలు – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఆహారాన్ని, నీటిని, రాగిపాత్రలలో పెట్టి వాడుకోవటం ఆరోగ్యరీత్యా మంచిదని మన పూర్వీకులు చెబితే… అవేవీ పట్టించుకోకుండానే, భారతీయులవి మూఢనమ్మకాలనీ, ’మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండ’ అని భారతీయులంటారనీ, తెగ గేలి చేసారు. మళ్ళీ ఇప్పుడు మన పూర్వీకులు అన్న వాటినే, శాస్త్రవేత్తలు ’కొత్తగా పరిశోధనలు’ చేసి కనుక్కుంటున్నారు. ఇదేం వింత బావా?

సుబ్బారావు:
అంతే మరదలా! మన పూర్వీకులు చెప్పినవీ, అప్పటికి ప్రజల వాడకంలో ఉన్నవీ ’తుస్సు’ అంటూ పాతవాటి స్థానే గాజు, పింగాణి వంటి కొత్త వస్తువుల్ని తెచ్చి అప్పుడు వ్యాపారం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పాతవే ’నికార్సు’ అంటూ, గాజు పింగాణి వంటి వాటి స్థానే మళ్ళీ రాగిపాత్రలు గట్రా తెచ్చి మరోమారు వ్యాపారం చేసుకుంటారు.

సుబ్బారావు:
అయితే, ఈ శాస్త్రవేత్తల ఆవిష్కరణలన్నీ భవిష్యత్తు వ్యాపార సూత్రాల కోసమా, బావా?

No comments:

Post a Comment