Friday, December 18, 2009

భళ్ళున కుండ పగిలినట్లుంది

[లోకసత్తా నాయకుడి ముందు ప్రధాని మన్మోహన్ సింగ్ ఆవేదన - వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! లోక్ సత్తా నాయకుడు జె.పి. ముందు ప్రధాని మన్మోహన్ సింగ్ ఆవేదన వెళ్ళగక్కాడట. మనస్సు విప్పి బాధలు పంచుకున్నట్లున్నాడు.

సుబ్బారావు:
రాజకీయాల్లోకి రాకముందు, పూర్వాశ్రమంలో ఇద్దరూ బ్యూరాక్రాట్లే కదా మరదలా! ’ఆ రోజులే నయం. ఆఫీసు వర్కు అయిపోతే ఏ బాధ్యాత లేదు. ఏదైనా అయితే పైవాడి మీదికో, క్రింది వాడి మీదికో తోసేసి రెడ్ టేపిజం జరిపేస్తే రోజులు హాయిగా గడిచిపోయేవి. ఇప్పుడు అన్నిటికి తానే బాధ్యుడుగా ఉండవలసివస్తున్నది’ అన్పించిందేమో?

సుబ్బలష్షిమి:
’గతించిన కాలమే మిన్న రాబోయే రోజుల కన్న’ అన్న కవి వాక్యాన్ని, ’గతించిన కాలమే మిన్న నడుస్తున్న రోజుల కన్నా’ అని మార్చి చదువుకుంటారేమో!

No comments:

Post a Comment