Saturday, December 12, 2009

ఎరక్క పోయి వచ్చాను ఇరుక్కు పోయాను

[తొందరపాటు నిర్ణయం తీసుకోం - ప్రధాని మన్మోహన్ సింగ్ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! తెలంగాణా విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోం అంటున్నాడు ప్రధానమంత్రి. మరి బుధవారం అర్ధరాత్రి హోంమంత్రి చిదంబరం అధిష్టానదేవత సోనియా తరుపున ప్రకటించిన నిర్ణయం ఏమిటి బావా? తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం అమోదించమని ప్రకటించి, తర్వాత దాన్ని తీర్మానం ప్రవేశపెట్టమనటంగా మార్చారని ముఖ్యమంత్రి రోశయ్య చెబుతున్నాడు కదా! ఈ మతలబు అర్ధం ఏమిటి?

సుబ్బారావు:
తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ అంటూ షురూ చేశాక... ఇక తొందరపాటు, నెమ్మదిపాటు, గ్రహపాటు ఏముంటాయి మరదలా! నిజానికి అన్నిటి లాగే దీన్లోనూ రెడ్ టేపిజం ఆట ఆడుకోవచ్చులే అనుకుని షురూ చేసినట్లున్నారు. ఇరుక్కుపోయారు.

సుబ్బలష్షిమి:
చిన్నప్పడు విన్న ’ఎరక్కపోయి వచ్చాను. ఇరుక్కుపోయాను’ అన్న అక్కినేని నాగేశ్వరరావు సినిమా పాట గుర్తొస్తోంది బావా!

1 comment:

  1. 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.

    ReplyDelete