Monday, January 19, 2009

14. ప్రజా సమస్యల కంటే కోడిపందాలే లాభం


సంక్రాంతికి కోడిపందాలు నిర్వహణ కోసం పశ్చిమ గోదావరి ఎం.ఎల్.ఏ.లు సి.ఎం. వద్ద పట్టుపట్టి సాధించుకొని కోట్లరూపాయలు దాని పై జూదం నడిపిన వార్తల నేపధ్యంలో]


సుబ్బారావు:

పశ్చిమ గోదావరి ఎం.ఎల్.ఏ.లు, కోడి పందాల నిర్వహించుకోడానికి సి.ఎం. దగ్గర పట్టుపట్టి సాధించుకోని నిర్వహించుకొన్నారు. సంక్రాంతికి కోడిపందాలు జూదం బాగా నడిపారు మరదలా!


సుబ్బలష్షిమి:

అవునుబావా! ఇలాంటి వాటి కోసం పట్టుబట్టే ఈ ఎం.ఎల్.ఏ.లూ, రాజకీయనాయకులూ ప్రజా సమస్యలు పరిష్కారానికి పట్టుబట్టరేం?


సుబ్బారావు:

ప్రజల సమస్యలు పరిష్కరిస్తే ఏమొస్తుంది బూడిద? అదే కోడిపందాలైతే డబ్బులూ, చికెనూ రెండూ వస్తాయి గాని.


************

No comments:

Post a Comment