Friday, February 19, 2010

ప్రజలు రాజకీయాల్లో అవినీతినీ, కులతత్వాన్ని పట్టించుకోవటం లేదా?

[కలల్లో విహరింపజేయలేను - శేఖర్ కమ్ముల వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! శేఖర్ కమ్ముల తన కొత్త సినిమా ’లీడర్’ విడుదల సందర్భంగా ఈనాడుకి ఇంటర్యూ ఇచ్చాడు. అందులో

>>>ఈనాడు:
ఈ చిత్రంలో ఏ పక్షాన్ని సమర్ధించారు?

శేఖర్ కమ్ముల:
ఒక పార్టీనో... ఎవరో ఓ వ్యక్తినో విమర్శించడం గానీ, సమర్ధించటం గానీ చేయలేదు. మన వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపించాను. అవినీతి, కులతత్వం లేని రాజకీయాలు అవసరమని ప్రస్తావించాను.

ఈనాడు:
మీరన్న రెండు అంశాల్నీ ప్రజలు పెద్దగా పట్టించుకోవట్లేదే?

మొత్తానికి... ’ఈనాడు’ ప్రజలు రాజకీయాల్లో అవినీతినీ, కులతత్వాన్ని పట్టించుకోవటం లేదని స్టాంపు కొట్టేస్తూంది. చూశావా?

సుబ్బారావు:
మరి మీడియా చేస్తోంది అదే గదా మరదలా! ఓ ప్రక్క ప్రజలు "ఇదెక్కడి అవినీతిరా బాబోయ్!" అని మొత్తుకుంటుంటే, "అదేం లేదు. మీకసలు ఏవీ పట్టటం లేదు" అని ’ఈనాడు’ మాస్ హిప్నాటిజం చెయ్యాలని ఫీట్లు చేస్తోంది! లేకపోతే జనాలు పట్టించుకోకుండానే ఇన్ని కుల సంఘాలున్నాయా?

No comments:

Post a Comment