Thursday, February 11, 2010

నిజాయితీపరులు రాజకీయాల్లోకి రావాలట!

సుబ్బలష్షిమి:
బావా! రాజకీయాల్లోకి నిజాయితీ పరులు రావాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు అంటోంది విన్నావా?

సుబ్బారావు:
అందుకే కాబోలు మరదలా! పీవీజీ లాంటి నిజాయితీపరులని పార్టీ నుండి తరిమేసింది. ఎన్డీ తివారీ ల్లాంటి వాళ్ళకి పదవులు కట్టబెట్టింది. వాళ్ళ కేసుల్నీ మాయం చేస్తుంది. చూడు, రాజ్ భవన్ లో తివారీ కామక్రీడల కేసు గురించి ఎక్కడైనా ఊసన్నా ఉందేమో! పైగా నిజాయితీ పరులు రాజకీయాల్లోకి రావాలంటూ స్టేట్ మెంట్లు ఇస్తుంది. ఎంతైనా ప్రభావశీల మహిళ కదా!?

సుబ్బలష్షిమి:
’చెప్పేవి నీతులు - తీసేవి గోతులు’ అంటే ఇవే కాబోలు బావా!

1 comment:

  1. రాజకీ(చ)య నాయకుల దృష్టిలో అవినీతి పనులన్నీ "అవి నీతి పనులే"!!

    -----సురేఖ*

    ReplyDelete