Monday, February 22, 2010

దాడులు చేస్తుంటే, విడిపోతామంటూ ఏకాభిప్రాయానికి రాక ఛస్తరా...?

[ఏకాభిప్రాయం తర్వాతే తెలంగాణా అయినా, సమైక్యాంధ్ర అయినా... చిదంబరం.
తెలంగాణా పరిధిలోని బ్యాంకుల్లో విధులు నిర్వహిస్తున్న సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులపై, తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారులు దాడులు చేసి వెళ్ళిపోవాలని బెదిరిస్తున్నారని అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణాను అడ్డుకునే వారి ఆస్తులు లెక్కకడుతున్నాం - ఐకాస కన్వీనర్ కోదండరాం. - వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఓ ప్రక్క హోమంత్రి చిదంబరం, ఏకాభిప్రాయం తర్వాతే ఏదైనా అంటున్నాడు. మరోప్రక్క సీమాంధ్ర ఉద్యోగులపై దాడులని ఎవరూ కట్టడి చేయటం లేదు. ఇలా తన్ని తగలేస్తే ’విడిపోతాం బాబోయ్!’ అంటూ ఏకాభిప్రాయానికి రాక ఛస్తారా?

సుబ్బలష్షిమి:
మరి అందుకే గదా మరదలా, తెరాస, కోదండ రాంలు సీమాంధ్ర ప్రజలు ఏకాభిప్రాయానికి రావటం కోసం కృషి చేస్తున్నారు. పొమ్మని పొగ బెట్టాక, ఇంకా పోకపోతే తిట్టి కొట్టే దాకా పోతే, పోకేం చేస్తారు, ఏకాభిప్రాయానికి రాకేం చేస్తారని వాళ్ళ ధీమా!

2 comments:

  1. Thanks for the Idea.. An idea can change lives...

    ReplyDelete
  2. kaneesam mee okkariki doora drushti undanna maata !

    ReplyDelete