Friday, July 2, 2010

ఏ రోలు దగ్గర ఆ రోటిపాట పాడటం అంటే ఇదే!

[>>>1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల విషయం ప్రస్తావిస్తూ.. భారత న్యాయవ్యవస్థలో కొన్ని లొసుగులు ఉన్నాయని మన్మోహన్ సింగ్ అంగీకరించారు. - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన సిక్కుల ఊచకోత విషయం ప్రస్తావిస్తూ, భారత న్యాయవ్యవస్థలో లోపాలున్నాయని మన్మోహన్ సింగ్, మొన్న కెనడా పర్యటనలో అన్నాడట తెలుసా?

సుబ్బారావు:
అవునా!? మరి ఆ విషయం తెలిసీ, జగదీష్ టైటర్లని ఎందుకు దరిజేర్చుకు ఆదరిస్తున్నారట? మొత్తానికీ ఈ ఆర్దిక వేత్త.... ‘ఏ రోలు దగ్గర ఆ రోటిపాట పాడటం, ఏ ఎండకు ఆ గొడుగు పట్టటం’ వంటి తన గుప్త విద్యని, ఇప్పుడు బాగానే ప్రదర్శిస్తున్నాడు.

సుబ్బలష్షిమి:
అంతే బావా! బహిర్గతమైతేనే కదా ఎవరేమిటో తెలిసేది?

No comments:

Post a Comment