Sunday, July 25, 2010

సోనియా త్యాగంతో పోల్చుకుంటే ప్రజల త్యాగం ఏపాటిది?

[చిన్నపట్టణాల్లో సెజ్ లు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సెజ్ ల ఏర్పాటు నిబంధనలను, కేంద్ర ప్రభుత్వం సవరించటంతో, చిన్న పట్టణాల్లో వాటి ఏర్పాటు మరింత ఆకర్షణీయం కానున్నట్లు నాస్కాం ప్రెసిడెంట్ సోమ్ మిట్టల్ చెప్పాడట. గుట్టు చప్పుడు గాకుండా సెజ్ ల ఏర్పాటు నిబంధనలను ఎప్పుడు సవరించారో బావా!?

సుబ్బారావు:
టట్టడాయ్! ఇహ కాస్కో పిల్ల! నంద్యాల, గిద్దలూరు, పొన్నూరు, చెన్నూరుల్లో కూడా, ఇక సెజ్ ల కోసం భూములు లాక్కుంటారు. ప్రజల బతుకులు ‘భీంరావ్ బాడాలే’ మరదలా!

సుబ్బలష్షిమి:
ఒకప్పుడు కత్తులూ కటార్లు పట్టుకుని... గజనీ, ఘోరీ మహమ్మదులు వచ్చారు.
తర్వాత తూటాలూ తుపాకులూ పట్టుకుని... బ్రిటీషూ, ఫ్రెంచి వాళ్ళొచ్చారు.
ఇప్పుడు కాగితాలు కలాలూ పట్టుకుని... మన్మోహన్ సింగులూ, సోనియాలూ వచ్చినట్లున్నారు బావా!
చూస్తుండగానే దేశం మొత్తం అన్యాక్రాంతం అయిపోతుంటే, జనాలు మాత్రం, ఇంకా ‘ఇక్కడ ప్రజాస్వామ్యమే నడుస్తుందంటూ’ కలవరింతలు పెడుతున్నారు.

సుబ్బారావు:
ఇండియా... సింగపూరూ, అమెరికా ల్లాగా అవ్వాల్లంటే ప్రజలు తమ ఆస్తుల్ని ఆ మాత్రం త్యాగం చెయ్యాలి కదా మరదలా! సోనియాను చూడు! ఇండియాను ఎక్కడికో తీసుకెళ్లటానికి... తనకు అంది వచ్చిన ప్రధాని పదవిని త్యాగం చేయ లేదా? ఆ త్యాగంతో పోల్చుకుంటే ప్రజల త్యాగం ఏపాటిది?

సుబ్బలష్షిమి:
నిజమే బావా! ఇప్పటికీ, ప్రజల త్యాగం కంటే సోనియా త్యాగమే, కాంగ్రెస్ వాళ్ళకి భజన కీర్తనగా కనిపిస్తుంది.

2 comments:

  1. sonia thyagamuto kodukki pradhanipadavi vastundi.prajalu thyagamu cheyyakunte thutalavarsham kurustundi.gajula

    ReplyDelete
  2. gajula గారు: బాగా చెప్పారు! :)

    ReplyDelete