Monday, July 5, 2010

ఎవరెంత బాగా గొంతు పిసికారూ?

[జనంపై పెట్రోభారం తక్కువే. విపక్షాల ఆందోళనలో అర్ధం లేదు. మురళీ దేవ్ రా ధ్వజం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పెట్రోధరల పెంఫుని కేంద్ర పెట్రోలియం మంత్రి మురళీ దేవ్ రా ఎంత అడ్డగోలుగా సమర్ధించుకుంటున్నాడో చూడు! ఈ పెంఫువల్ల పడే అదనపు భారం, వంటగ్యాస్ పై రోజుకు రూపాయి కన్నా తక్కువగా, కిరోసిన్ పై 26-27 పైసల కన్నా తక్కువగా ఉందని, అతడు గుర్తు చేశాడట. కిరోసిన్ పై లీటర్ కు 18.07/Rs. లు పెంచాల్సి ఉన్నా, తాము కేవలం 3/-రూ.లు మాత్రమే పెంచారట. ఎంత దయతో మెలిగామో చూడమంటున్నాడు.

సుబ్బారావు:
వంటగ్యాస్ ధర పెరిగితే, కమర్షియల్ సిలిండర్ ధరా పెరుగుతుంది. దెబ్బతో హోటళ్ళలో తినుబండారాలు ధర కూడా పెరుగుతుంది. అదీగాక, పెట్రో ధరలు పెరిగిన తక్షణమే, రవాణా ఛార్జీలు పెరుగుతాయి. దాంతో అన్ని వస్తువుల ధరలూ పెరుగుతాయి. అవేమీ మాట్లాడకుండా, గ్యాస్ బండపై రోజుకు రూపాయి కంటే పెరగదని, ఎంత మాయమాటలు చెబుతున్నాడో సదరు మంత్రి మహాశయుడు!

సుబ్బలష్షిమి:
`గతంలో ఎన్డీయే ప్రభుత్వం అడ్డగోలుగా ధరలు పెంచలేదా? విపక్షాలు వంచనకు పాల్పడుతున్నాయి. విపక్షాల ఆందోళనలో అర్ధం లేదని' కూడా సెలవిస్తున్నాడు.

సుబ్బారావు:
ధరలు పెంచడంలో ఎన్డీయే, యూపీఏలు ఎవరికి వారే సాటి! అపాటి దానికి ఎవరెక్కువ పెంచారంటూ పోలికలు కూడాను!

సుబ్బలష్షిమి:
అయితే ఎవరెంత బాగా గొంతు పిసికారంటూ పోలికలన్న మాట!
~~~~~

No comments:

Post a Comment