Friday, July 23, 2010

సంస్కృతి నాశనం చేసుకున్నాక ఇటువంటి వారే తామరతంపరగా తారసపడతారు!

[పార్క్ వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ అయూబ్, విద్యార్ధినులపై అత్యాచారాలు చేసిన అపర కీచకుడు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! 2002 లో స్థాపించబడిన పార్క్ వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్, ఆయూబ్ అట. ఏభై ఏళ్ళ గురువు, శిష్యురాళ్ళ మీద అత్యాచారం చేశారు. దృశ్యాలను సెల్లు ఫోన్ లో బిగించి బ్లాక్ మెయిలింగు చేస్తూ లైంగిక వాంఛలు తీర్చుకున్నాడట. పైగా సదరు స్కూలు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి అనుబంధ సంస్థ అట కూడా, తెలుసా?

సుబ్బారావు:
‘మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ’ అనే సంస్కృతీ సాంప్రదాయాలని, సత్య ధర్మాలనీ మరిచి పోయాక కేంబ్రిడ్జి అనుబంధాలైనా, ఆక్స్ ఫర్డ్ అనుబంధాలైనా ఇంతే మరదలా! తమ కుమార్తెల కంటే చిన్న వయస్సు పిల్లలపైన కామవాంఛ కలిగి ఉండేవాళ్ళని పశువులతో పోల్చినా అవీ అవమాన పడతాయేమో!

సుబ్బలష్షిమి:
అవును బావా! పోలీసు రాధోడ్ లూ అంతే! గురువు అయూబ్ లూ అంతే! ఎన్డీ తివారీలు అంతే! ఏమైనా రానున్న గురు పూర్ణిమ నేపధ్యంలో గొప్ప గురువే తారసపడ్డాడు.

సుబ్బారావు:
గొంగట్లో తింటే వెంట్రుకలే వస్తాయి మరదలా! సంస్కృతి నాశనం చేసుకున్నాక ఇటువంటి వారే తామరతంపరగా తారసపడతారు.

4 comments:

  1. // సంస్కృతి నాశనం చేసుకున్నాక ఇటువంటి వారే తామరతంపరగా తారసపడతారు.//

    కళ్ళెదురుగా చూస్తున్న వాటిని ఎంతచక్కగా మాటల్లో కుదించారు! మనకు సంస్కృతే లేదనే వాళ్ళు ఎక్కువయ్యారు. కీప్ అప్ ది గుడ్ వర్క్ అమ్మఒడి.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యని మనసారా ఆనందించానండి! :)

    ReplyDelete
  3. మైనారిటీ ముక్కుందిగా! తప్పించడానికి మనవాళ్ళకు మార్గాలెన్నో!

    ReplyDelete
  4. చిలమకూరు విజయ మోహన్ గారు: నిజమే సుమా!!

    ReplyDelete