Tuesday, July 27, 2010

ఇవాళా రేపూ, పత్రికలూ రాజకీయ పార్టీలూ కుటుంబ ఆస్తులై పోయాయి కదా!

[జగన్ ఓదార్పు యాత్ర కవరేజ్ - సాక్షి పత్రిక - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సాక్షి పత్రిక లో, పరమ ఫాక్షనిస్టూ, పక్కా అవినీతితో వేల కోట్ల రూపాయలు గడించిన వై.యస్.ఆర్. ని పట్టుకుని... మహానేత అంటూ, ప్రధాన పేజీ పై మూలన, అదేదో క్రీస్తు సూక్తి లెవెల్లో... రోజుకో డైలాగు, మరణించిన వై.యస్.ఆర్. పేరిట వేస్తున్నారు చూశావా?

సుబ్బారావు:
అలాగంటావేం మరదలా! జగన్ కి, జగన్ తండ్రి మహానేతే మరి! జన్మనివ్వటమే గాక... ఆస్తిపాస్తులూ, కెరియర్ స్టెప్పులూ, ఎదిగేందుకు టిప్పులూ ఇచ్చాడు మరి! ఇక సాక్షి పత్రిక అంటావా, అది వాళ్ళ కుటుంబ పత్రిక! ఇవాళా రేపూ... పత్రికలూ, రాజకీయ పార్టీలూ కుటుంబ ఆస్తులై పోయాయి కదా!

సుబ్బలష్షిమి:
ఇలాంటి కుటుంబ పార్టీలని, కుటుంబ బాకా మీడియాలని భరించవలసి రావటం నిజంగా ప్రారబ్దమే బావా!

సుబ్బారావు:
చిన్నప్పుడు సోషల్ పాఠాల్లో... ‘ప్రజాస్వామ్యంలో పత్రికలది [మీడియాది] ప్రముఖ పాత్ర’ అని చదువుకున్నాం. అప్పుడు తెలియలేదు గానీ, ఇప్పుడు మాత్రం మీడియా ముఖం/గుట్టు ఏమిటో, బాగా అర్దమౌతోంది మరదలా!

1 comment: