Tuesday, June 1, 2010

తెగే దాకా తాడు లాగొద్దనుకున్నప్పుడు ఇలాంటి ప్రకటనలిస్తారన్నమాట!

[జగన్ ఓదార్పు యాత్ర వివాదాల పైన - అధిష్టానం తగిన సమయంలో తగిన చర్య తీసుకుంటుంది’ అంటూ ప్రణబ్ ముఖర్జీ, అధిష్టానపు ఆగ్రహాన్ని ప్రకటించిన నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
జగన్ వరంగల్ జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టిన వ్యవహారంలో రగడ జరిగింది కదా! ఆ విషయమై అధిష్టానం ఆగ్రహంగా ఉందంటూ, ప్రణబ్ ముఖర్జీ - తగిన సమయంలో తగిన చర్య తీసుకుంటాం’ అంటున్నాడు. ఇదేం గమ్మత్తు బావా?

సుబ్బారావు:
‘ఇప్పుడే చర్య తీసుకుంటాం’ అంటే... వై.యస్.జగన్ ‘తీసుకోపొమ్మన్నా’డనుకో? అప్పుడు తలనొప్పే కదా! అలాంటప్పుడు, తెగే దాకా తాడు లాగొద్దనుకున్నప్పుడు ఇలాంటి ప్రకటనలిస్తారన్నమాట!

సుబ్బలష్షిమి:
అంటే ఇవి ముందు జాగ్రత్త ప్రకటనలన్న మాట! అప్పటికి ఎదుటి వాడు ఆగాడా సరి! లేదంటే తమ పరువు కాపాడుకోవాలి కదా మరి!?

No comments:

Post a Comment