Tuesday, June 15, 2010

యూపీఏ ప్రభుత్వ పిల్లి, మరీ ఎక్కువగా కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నట్లుంది!

[భోపాల్ దుర్ఘటన పై పది రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా మంత్రివర్గ బృందానికి ప్రధానమంత్రి ఆదేశం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! భోపాల్ దుర్ఘటన మీద సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రధానమంత్రి, మంత్రి వర్గ బృందాన్ని ఆదేశించాడట. ఆ బృందంలో తమిళ నాడు ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు అళగిరి కూడా ఒక సభ్యుడు. ఇతడు పార్లమెంట్ సమావేశాలకు కూడా రాడు. ఆ విషయమై సాక్షాత్తూ స్పీకర్ మీరా కుమార్ కూడా ప్రకటించింది. అతడికి తమిళం తప్ప మరే భాషా రాదు. మంత్రి వర్గ బృందంలో అతడేం చేస్తాడు బావా?

సుబ్బారావు:
దాన్ని బట్టే తెలియటం లేదా మరదలా, ప్రధానమంత్రి నియమించిన బృందం ఏమిటో, ఎందుకో, ఎలా పనిచేయనుందో?

సుబ్బలష్షిమి:
‘యూపీఏ ప్రభుత్వ పిల్లి, మరీ ఎక్కువగా కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నట్లుంది’ బావా!

No comments:

Post a Comment