Thursday, April 8, 2010

ఆర్ధిక వేత్త మాటలకు అర్ధాలే వేరులే!

[అందోళనలతో ధరలు దిగిరావని ప్రధాని పిలుపు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ప్రధాని మన్మోహన్ సింగ్ "అందోళనలతో ధరలు దిగిరావని, ధరల పెరుగుదలపై ధ్వజమెత్తకుండా.... తమ అపార అనుభవాన్ని, జ్ఞానాన్ని, అవగాహనను రంగరించి, ఓ సానుకూల పరిష్కారానికి పార్టీలన్నీ తోడ్పడాలని" అని కోరుతున్నాడు.

మొన్న కాండ్లా రేవు నుండి గల్ఫ్ కి బియ్యం దొంగతనంగా[?] రవాణా జరిగింది. క్రితం సంవత్సరం కృష్ణపట్నం రేవు నుండి బియ్యం దొంగ రవాణా జరిగింది. సిపిఐ చికెన్ నారాయణ దొంగనిల్వలని ఎన్నో బయటపెడితే , ప్రభుత్వం అతడిపై కేసులు పెట్టింది. ఇన్ని రకాలుగా ప్రజలకీ, ప్రతిపక్షాలకీ, పత్రికలకీ తెలుస్తున్న విషయాలు ప్రభుత్వానికి తెలియటం లేదా? ఇవన్నీ అరికడితే చాలు కదా! ఇంకా పరిష్కారానికి పార్టీలు ఏరకంగా తోడ్పడాలి బావా?

సుబ్బారావు:
నువ్వు నిజంగా అమాయకురాలివే మరదలా! ప్రధాని ఏ మన్నాడో ఒకసారి సరిగ్గా గుర్తు తెచ్చుకో!
>>>"అందోళనలతో ధరలు దిగిరావని, ధరల పెరుగుదలపై ధ్వజమెత్తకుండా.... తమ అపార అనుభవాన్ని జ్ఞానాన్ని, అవగాహనను రంగరించి ఓ సానుకూల పరిష్కారానికి పార్టీలన్నీ తోడ్పడాలి."

అంటే ’చేసిన గొడవలు చాలు. వచ్చి మీ వాటాలు మీరు పట్టుకు పోండి’ అని అర్ధం మరదలా!

2 comments:

  1. 'చేసిన గొడవలు చాలు. వచ్చి మీ వాటాలు మీరు పట్టుకు పోండి’

    lol :))

    -sarath.s

    ReplyDelete
  2. శరత్.ఎస్.గారు : నెనర్లండి!

    ReplyDelete